CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

పడమట నర్సాపురం లో కరెంటు బిల్లుల మోత..

Share it:

 


బిల్లులు కట్టకుండా బాయ్ కాట్ చేసిన ప్రజలు..

సమస్యను పరిశీలించి పరిష్కరిస్తామన్నా మండల విద్యుత్ శాఖ అధికారి రఘురామయ్య...



మన్యం టీవీ : జూలూరుపాడు,

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, జూలూరుపాడు మండలం లోని పటమట నర్సాపురం గ్రామ పంచాయతీలో ఈనెల కరెంటు బిల్లులు అధికంగా వేశారంటూ స్థానిక ప్రజలు శనివారం కరెంటు బిల్లులు కట్టకుండా బాయ్ కాట్ చేశారు. విషయం తెలుసుకున్న మండల విద్యుత్ శాఖ అధికారి రఘురామయ్య సంఘటన స్థలానికి చేరుకొని వినియోగదారులతో మాట్లాడి సమస్యను పరిశీలించి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఏ ఈ రఘురామయ్య మాట్లాడుతూ ..ఐ ఆర్ డి ఎ స్కానింగ్ సిస్టమ్ ద్వారా వచ్చిన బిల్లులో ఎలాంటి లోపాలు ఉండవని తెలిపారు. ఎవరైనా పాత మీటర్లు మార్చుకోకపోతే మాన్యువల్ గా వచ్చే బిల్లుల్లో తప్పిదాలు జరిగితే పరిశీలించి పరిష్కరిస్తామని తెలిపారు. విద్యుత్ వినియోగదారులంతా 23 వ తారీఖున యధావిధిగా బిల్లులు కట్టుకోవలసినదిగా కోరారు. పడమట నర్సాపురం సబ్ స్టేషన్ హెడ్ క్వార్టర్ కావడంతో ప్రత్యేక ఫీడర్ ద్వారా నిరంతర విద్యుత్ అందించాలని, ప్రతి నెల కరెంటు బిల్లు కట్టుకునే ఎసులు బాటు బాటు కల్పించాలని, తద్వారా వినియోగదారులకు బిల్లు భారం తగ్గుతుందని స్థానికులు మండల విద్యుత్ శాఖ అధికారి రఘురామయ్య ను కోరగా సానుకూలంగా స్పందించిన ఏ ఈ సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కట్రం మోహనరావు, పాలక సభ్యులు కాజా రమేష్, అన్నవరపు సత్యనారాయణ, బచ్చల సారయ్య, పదిమల నాగయ్య, బాబురావు, రామారావు, దామెర్ల శ్రీకాంత్, తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: