జూలై 5న భద్రాచలంలో జరిగే రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరు కావాలి.
పిలుపునిచ్చిన తెలంగాణ జన సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గోపగాని శంకర్ రావు.
మన్యం మనుగడ, పినపాక:
పోడు భూముల సమస్యల పరిష్కారం దిశగాజూలై 5న ఉదయం 10 గంటలకు భద్రాచలంలో జరిగే రౌండ్ టేబుల్ సమావేశానికి ఆదివాసీ సంఘాలు, గిరిజన సంఘాలు, రైతు సంఘాలు హాజరు కావాలని, పినపాక లో జరిగిన సమావేశంలో తెలంగాణ జన సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గోపగాని శంకర్ రావు తెలియజేశారు.ఈ సమావేశానికి తెలంగాణ జన సమితి అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరామ్ వస్తున్నారని, అందువలన అన్ని సంఘాల నాయకులు హాజరై సమస్యల పరిష్కార దిశగా ఆలోచించాలని పిలుపునిచ్చారు.
Post A Comment: