మన్యం టీవీ, అశ్వాపురం:ఈరోజు అశ్వాపురం మండల కేంద్రంలో జరిగిన ధర్నాలో పాల్గొని ధర్నాను ఉద్దేశించి సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు గద్దల శ్రీనివాసరావు ప్రసంగిస్తూ
కేంద్రంలోని బిజెపి ప్రభుత్వ పాలన దేశ ప్రజల జీవితాలను చిన్నాభిన్నం చేస్తోందని కేంద్ర ప్రభుత్వ నేరపూరిత అసమర్థ పాలన ఎండగట్టాలని డిమాండ్ చెసినారు.
కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చి ప్రజానికాన్ని ఆదుకోవాల్సిన టిఆర్ఎస్ ప్రభుత్వం కేంద్రం పట్ల మెతకవైఖరి లభిస్తుందని ఇది సరిఅయిన వైకరికాదని కొరినారు
లాక్ డౌన్ పొడిగింపు తప్ప ఉపాధి పోయి ఆదాయాలు దెబ్బతిన్న కార్మిక కుటుంబాలకు ఎటువంటి ఆర్థిక తోడ్పాటను ఇవ్వడం లేదని, ఈ నేపథ్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకొచ్చి ప్రజలు రానున్న రోజుల్లో పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపు నిచ్చారు. అనంతరంఅశ్వాపురం ఎమ్మార్వో కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిఐటియు మండల నాయకులు కే రాములమ్మ, కిరణ్ కుమారి, శిరీష, జి రమణ, జై తిరుపతమ్మ, రమణ, తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: