మన్యంటీవీ, అశ్వారావుపేట:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ సునీల్ దత్ ని అశ్వారావుపేట ఎంపీపీ జల్లిపల్లి శ్రీరామూర్తి మర్యాద పూర్వకంగా కలవడం జరిగింది. ఈ సందర్బంగా అశ్వారావుపేట లోని పోలీస్ స్టేషన్ లో ఉన్న కాలి పోస్ట్ ల గురించి మాట్లాడడం జరిగింది. అశ్వారావుపేట మండలం చాలా విస్తీర్ణం గల మండలం, అలాగె ఆంధ్ర సరిహద్దు ప్రాంతం కావున ఆంధ్ర బోర్డర్ దగ్గర గా ఉండటం వలన ఈ కరోనా సమయంలొ బోర్డర్ సిబ్బంది కొరతతో ఇబ్బంది పడుతున్నారు. కావునా ఇప్పుడు ఉన్న సిబ్బంది సరిపోవడం లేదని అలాగే ప్రస్తుతం వుండవలసిన సిబ్బంది లో కూడ కొన్ని పోస్ట్ లో కాలిలు వున్నాయని వెంటనే అశ్వారావుపేట పోలీస్ స్టేషన్ కీ సిబ్బంది కొరతను పూర్తీ చేసి అదనంగా కొంత సిబ్బందిని నియమించాలని జిల్లా ఎస్పీ సునీల్ దత్ కి వినతి పత్రం అందజేసిన అశ్వారావుపేట మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు జల్లిపల్లి శ్రీరామమూర్తి. ఈయనతో పాటు మండల తెరాస పార్టీ కార్యదర్శి బండారు. శ్రీను పాల్గొన్నారు.
Post A Comment: