ఆదర్శనంగా నిలుస్తున్న అన్నవరపు సత్యనారాయణ..
మన్యం టీవీ : జూలూరుపాడు, కరోన టెస్టింగ్ క్యాంపు లు, మేలైన మందుల పంపిణీ తో వార్తల్లోకెక్కిన
కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అన్నవరపు సత్యనారాయణ హోమ్ ఐసోలాషన్ లో ఉండి ఉపాధి కోల్పోయిన 50 మంది నిరుపేద కరోన పీడిత కుటుంబాలకు సోమవారం నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. పడమట నర్సాపురం, నర్సాపురం కాలని, కాల్యా తండా, బేతాళపాడు, రాచబండ్ల, గ్రామాలకు చెందిన వారికి నిత్యవసర సరకులు పంపిణీ చేసి పలువురికి ఆదర్శనంగా నిలుస్తున్నారు.
నిత్యావసర కిట్ లో
పప్పులు, చింతపండు, వంట నూనెలు ,మసాలా దినుసులు వంటి వేయి రూపాయల విలువైన వస్తువులు సత్య షీల గ్యాస్ ఏజెన్సీ, ఇతర మిత్రుల తోడ్పాటు తో పంపిణీ చేశామని సత్యనారాయణ
తెలిపారు. ఈ కార్యక్రమంలో జంపాల వాసుదేవ్, దామెర్ల సుధాకర్, సత్య షీలా గ్యాస్ ఏజెన్సీ సాయి, తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: