మన్యం మనుగడ, పినపాక:
ప్రతి కార్యకర్తకు టిఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని పినపాక శాసనసభ్యులు తెలంగాణ ప్రభుత్వ విప్ రేగా కాంతారావు అన్నారు. మంగళవారం పినపాక గ్రామానికి చెందిన సోంపల్లి తిరుపతి అనే కార్యకర్త గాయపడిన విషయం తెలుసుకొని ఆయనను ఇంటికి వెళ్లి పరామర్శించారు. ఆయన వైద్య ఖర్చుల నిమిత్తం నగదును అందజేశారు. ఈ కార్యక్రమంలో పినపాక మండల ఎంపీపీ గుమ్మడి గాంధీ, వైస్ ఎంపీపీ కంది సుబ్బారెడ్డి, టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు పగడాల సతీష్ రెడ్డి, రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు దొడ్డ శ్రీనివాస్ రెడ్డి, సీనియర్ నాయకులు బొలిశెట్టి నరసింహారావు, బత్తుల వెంకటరెడ్డి, కొండేరు రాము, కటకం గణేష్, యంపాటి సందీప్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: