మన్యం మనుగడ, పినపాక
పినపాక మండల వైస్ ఎంపీపీ కంది సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో పినపాక ప్రభుత్వ వైద్యశాల, ఏడూళ్ళ బయ్యారం పొలీస్ స్టేషన్, పినపాక తహసీల్దార్ కార్యాలయలకు12 పల్స్ ఆక్సీ మీటర్స్ ను సోమవారం అందజేయడం జరిగింది.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి ప్రళయ తాండవం చేస్తూ, ప్రజల ప్రాణాలు తీస్తున్న సమయంలో ప్రజల ప్రాణాలు రక్షిస్తూ తమ ప్రాణాలను సైతం పనంగా పెట్టి సేవలు అందిస్తున్న పోలీసు సిబ్బందికి, వైద్యులకు, ప్రభుత్వ అధికారులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా వారి కార్యాలయంలోని సిబ్బంది కొరకు పల్స్ఆక్సీ మీటర్స్ ను ఉచితంగా అందజేయడం జరిగింది అని, అన్నారు.ఈ కార్యక్రమంలో పినపాక సోసైటీ డైరక్టర్
కొండేరు రాము, టిఆర్ఎస్ నాయకులు దాట్ల వాసుబాబు , వైద్య, రెవిన్యూ ,పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
Post A Comment: