CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

పోడు భూముల సమస్యపై కదం తొక్కిన ఇల్లందు నియోజక వర్గ ఎమ్మెల్యే బానోత్ హరిప్రియ నాయక్

Share it:

 



మన్యం టీవీ : ఇల్లందు


ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇల్లందు నియోజక వర్గం కామేపల్లి మండలం లోని మద్దులపల్లి, జాస్తి పల్లి, కెప్టెన్ బంజర గ్రామాల సరిహద్దులలోని సర్వే నెంబర్ 185,186 గల భూములను స్థానిక రైతులు సాగు చేస్తుండగా ఫారెస్ట్ అధికారులు  రైతులను ఇబ్బంది గురి చేస్తుంటే అట్టి విషయాన్ని తెలుసుకున్న ఇల్లందు నియోజక వర్గ ఎమ్మెల్యే బానోత్ హరిప్రియ నాయక్ ఇల్లందు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ భానోత్ హరిసింగ్ నాయక్ సంఘటన స్థలానికి వెళ్లారు. ఫారెస్ట్ అధికారులను, రెవెన్యూ అధికారులను పిలిచి వారిని రైతుల తో సమన్వయ పరచి వారి యొక్క ఆధారాలు పరిశీలించాక, ఆపై ఉన్నతాధికారులతో మాట్లాడి ఆదేశాలు వచ్చేంత వరకు కూడా అ రైతులను పంట వేయకుండా ఇటువంటి ఇబ్బందులకు గురి చేయవద్దన్నారు. అంతేకాకుండా అక్కడ ఉన్న  రైతులకు  వెంటనే తమ వ్యవసాయ పనులు ప్రారంభించాలని ఏ విధమైన సమస్యలు ఉన్నా నేను చూసుకుంటాను సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కరిస్తారని రైతులకు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కామేపల్లి మండల పార్టీ అధ్యక్షుడు అంతోటి అచ్చయ్య, ఎంపీపీ భానోత్ సునీత, సిపిఎం నాయకులు దుగ్గి కృష్ణ, ఎంపీటీసీలు సర్పంచులు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: