- మాముళ్ల మత్తులో రెవిన్యూ కార్యాలయ సిబ్బంది..!
- రోజు రోజుకు పెరుగుతున్న మట్టి దందా
మన్యంటీవీ, అశ్వారావుపేట:
అక్రమ దారిలో అక్రమ మట్టి తొలకాలు జరుగుతున్నాయి. మండలంలోని అంకమ్మ చెరువు వద్ద మట్టి తొలకాలు విచ్చలవిడిగా జరుగుతున్న రెవెన్యూ అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారు. పట్ట పగలు ప్రభుత్వాధికారులు కళ్లు కప్పి మట్టిని కొల్ల కొడుతున్నారు. వ్యవసాయ భూమికి మట్టి తొలకాలు అనిమతి ఇచ్చామని రెవెన్యూ అధికారులు చెప్తుంటే ఒకపక్క మట్టి మొత్తం సగానికి పైగా విక్రయం పొందుతుంది. తహసీల్దార్ అనుమతి వ్యవసాయ భూమిలోకి మట్టి తొలడానికి తప్ప, ఇతర చోట్లకు చేరవేయడానికి అనుమతి ఇవ్వలేదు అని తెలిపారు. ఒక ప్రైవేట్ ఇళ్ల పునాధుల్లోకి మట్టిని తరలిస్తున్నారు. ఇదే విషయంపై స్థానిక రెవెన్యూ ఇన్స్పెక్టర్కి సమాచారం ఇచ్చిన స్పందన లేకపోవడం.. ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకోవడం పై స్థానికులు అధికారులు మాముళ్ళ మత్తులో ఉన్నారన చర్చలు వినిపిస్తున్నాయి. భారీగా ముడుపులు ముట్టయి అని కొందరి ఆరోపిస్తున్నారు. ఇదే కాకుండా ఇంతకు ముందు పలుమార్లు ఇలా జరిగిన సంఘటనలు చాలానే ఉన్నాయి. ఆర్ ఐ ద్రుష్టి కి తీసుకు వెళ్ళిన ప్రయోజనం లేదని స్థానికులు చెబుతున్నారు. మట్టితొలకాలు ఆపే నాధుడే లేకపోవడం వెనుక అశ్వరావుపేట రెవెన్యూ శాఖ పై పలు అనుమానాలకు మరియు కొన్ని చర్చలు కొనసాగుతున్నాయి.
Post A Comment: