CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

👉 పెంచిన పెట్రోల్, డీజిల్,గ్యాస్,నిత్యావసర సరుకులబ్ధరలు తగ్గించాలి

Share it:


 👉 రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చెయ్యాలి

👉 తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ భూములు అమ్మాలనే నిర్ణయాన్నిఉపసంహరించుకోవాలి


సీపీఐ,సీపీఎం,సీపీఐ ఎం ఎల్ న్యూ డేమోక్రసి నాయకులు రావులపల్లి రామమూర్తి,నెల్లూరి నాగేశ్వరరావు,ఆర్. మధుసూదన్ రెడ్డి డిమాండ్


మన్యం టీవీ మణుగూరు:

కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత పెట్రోల్,డీజిల్, గ్యాస్ ధరలు విపరీతంగా పెంచుతున్నాయని,వీటి ధరలు పెరగడం వలన,వీటి ప్రభావం నిత్య అవసర సరుకుల మీద పడి ధరలు సామాన్యులకు అందుబాటు లో లేకుండా పోయింది అని అన్నారు.శనివారం వామపక్ష పార్టీల పిలుపులో భాగంగా మణుగూరు అంబేద్కర్ సెంటర్ లో నిరసన ప్రదర్శన చేశారు.అనంతరం వీరు మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత సామాన్య ప్రజలు బ్రతికే పరిస్థితి లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తంచేశారు. మోడీ కార్పొరేట్ కంపెనీలకు రాయితీలు ఇస్తూ,పేదలను పట్టించుకోవడం లేదన్నారు. దేశంలో ప్రజలందరూ కరోనాతో ప్రాణాలు కోల్పోతూ,ఇబ్బందులు పడుతుంటే పెట్రోల్,డీజిల్, గ్యాస్ రేట్లు పెంచి సామాన్యులకు చుక్కలు చూపెడుతున్నారని అన్నారు.రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.తెలంగాణ ప్రభుత్వం,ప్రభుత్వ భూములు అమ్మాలనే నిర్ణయాన్ని తక్షణమే ఉప సంహరించుకోవలని డిమాండ్ చేశారు.ఈ రాష్ట్రంలో దళితులకు 3 ఎకరాలు ఇవ్వడానికి లేని  భూమి ఇప్పుడు అమ్మకానికి ఎక్కడి నుండి వచ్చిందని అన్నారు.తక్షణమే దళితులకు కేసీఆర్ చిప్పిన విదంగా 3 ఎకరాల భూమి పంచాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో సీపీఐ మండల,పట్టణ కార్యదర్శులు ఎస్.కె.సర్వర్, దూర్గ్యల.సుధాకర్,చింతల దశరదం,బి.వీరస్వామి రాములు,సీపీఎం నాయకులు కాటిబోయిన నాగేశ్వరరావు,నందం ఈశ్వర్ రావు,బొల్లం రాజు, న్యూ డేమోక్రసీ నాయకులు మోర రవి,గౌస్ తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: