CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

సింగరేణి కార్మికులచే కొత్త మల్లేపల్లి నిరుపేద కుటుంబాలకు క్వింటా బియ్యం నిత్యావసర వస్తువుల వితరణ

Share it:

 


మన్యం మనుగడ, మణుగూరు:

   సింగరేణి కాలరీస్ మణుగూరు ఏరియా ఓసి 2 

   రిలే- సి లో ఆపరేటర్లుగా పని చేస్తున్న.  గోసిక కుమారస్వామి, ఇందూరి శంకర్, పిట్టా వీరస్వామి, కె బాబూలాల్ , సంకెళ్ల నాగరాజు, ఎండి గౌస్ ల ఆధ్వర్యంలో  ఆదివారం సాయంత్రం సింగరేణి నిర్వాసిత కొత్త మల్లేపల్లి గ్రామానికి చెందిన నిరుపేద కుటుంబాలు మరియు ఇటీవల డెంగ్యూ వ్యాధి తో చనిపోయిన వారి కుటుంబ సభ్యులకు

 పాతిక కిలోల చొప్పున నాలుగు కుటుంబాలకు క్వింటా  బియ్యాన్ని     నిత్యవసర వస్తువులను వితరణగా అందజేశారు, ఈ సందర్భంగా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఇందూరి శంకర్ మాట్లాడుతూ  వృద్ధాప్యంలో కొంతమంది కుటుంబ యజమానులు అనారోగ్యంతో చనిపోయి కొన్ని కుటుంబాలు ఆర్థికంగా ఇబ్బంది పడటం సింగరేణి సేవా సమితి సభ్యుల ద్వారా తమకు తెలిసి  తమకు చేతనైనంత మేరకు చిరు సహాయం అందించామని ఇతర దాతలు కూడా స్పందించాలని ఇలాంటి వారికి సహాయం అందించాలని ప్రత్యేకించి ఈ కరోనా  టైంలో అనేక కుటుంబాలు చితికిపోయాయని ప్రభుత్వ సహకారం ఒక్కటే సరిపోదని స్వచ్ఛంద సంస్థలు తగు తోడ్పాటును అందించాలని ఆయన కోరారు, ఈ కార్యక్రమంలో దాతలు గోశిక కుమారస్వామి, ఐ శంకర్, పిట్టా వీరస్వామి, K బాబూలాల్ ,సంకెళ్ళ నాగరాజు, ఎండి గౌస్, సింగరేణి సేవా సమితి సభ్యులు నా సర్ పా షా, మేకల కేశవస్వామి, గ్రామస్తులు డేగల రాజేంద్రం, జూపాక జాను, డేగ కృష్ణ ,డేగల సంపత్ కుమార్, కర్రీ నరసింహారావు, సాయి కుమార్, రవి బాబు ,సురేష్ కుమార్ ,మార్తమ్మ ,సావిత్రి తదితరులు పాల్గొన్నారు

Share it:

TELANGANA

Post A Comment: