మన్యం టీవీ : జూలూరుపాడు,
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా,
జూలూరుపాడు మండలం లోని కొమ్ముగూడెం గ్రామం నుండి అనంతారం వరకు ప్రధానమంత్రి సడక్ యోజన పథకం కింద ఏడు న్నర కిలోమీటర్లు సుమారు నాలుగు కోట్ల రూపాయల వ్యయంతో బీటీ రోడ్డు పనులను ప్రారంభించారు. నామ్స్ ప్రకారం గ్రామాలలో సీసీ రోడ్డు, రోడ్డుకు ఇరువైపులా డ్రైనేజ్ నిర్మించాల్సి ఉండగా, గ్రామాలలో పనులు ఆపి గ్రామ శివారు నుండి పనులు ప్రారంభిస్తూ.. నాణ్యత ప్రమాణాలు పాటించకుండా వారి ఇష్టానుసారంగా పనులు చేస్తున్నారంటూ కాకర్ల గ్రామపంచాయతీ సర్పంచ్ రమాదేవి, ఎంపీటీసీ పొన్నెకంటి సతీష్ కుమార్, ఉప సర్పంచ్ చీమలపాటి కొండయ్య, మరియు గ్రామస్తులు పనులను అడ్డుకొని రోడ్డుపై బైఠాయించారు. ఈ సందర్భంగా ఎంపీటీసీ పొన్నెకంటి సతీష్ కుమార్ మాట్లాడుతూ గతంలో కూడా సి సి రోడ్డు విషయాన్ని పై అధికారుల కి దరఖాస్తు రూపంలో పెట్టామన్నారు. అప్పుడు అధికారులు హామీ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. కానీ కింది స్థాయి అధికారులు మా నామ్స్ లో లేదంటూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. విషయం తెలుసుకున్న పై అధికారులు ప్రజా ప్రతినిధులతో మాట్లాడి హామీ ఇచ్చిన తరువాత అక్కడి నుండి వెళ్ళిపోయారు ప్రస్తుతం పనులను కూడా అక్కడ కొంచెం ఇక్కడ కొంచెం చేస్తున్నారని అలా కాకుండా ఒక క్రమపద్ధతిలో చేయాలని కోరారు.
Post A Comment: