మన్యం టీవీ మణుగూరు:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా,
మణుగూరు మండలం లోని కొండాయిగూడెం గ్రామం ఎస్సీ కాలనీ లోని ఐదు కుటుంబాలు కరోనా వైరస్ భారిన పడడంతో ఎమ్మార్పీఎస్ నాయకులు పొడుతూరి విక్రమ్ ఆధ్వర్యంలో శుక్రవారం బాధితులకు నిత్యవసర వస్తువులు, పౌష్టికాహారం అందజేసి బాధితులకు భరోసా కల్పించారు.ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్ నాయకులు పొడుతూరి విక్రమ్ మాట్లాడుతూ కరోనా బాధితులను,ఆదుకునేందుకు ఎమ్మార్పీఎస్ సంఘం ఆసరాగా నిలుస్తూ అండగా నిలబడతామని తెలిపారు. బాధితులకు మనోధైర్యం కల్పిస్తూ జాగ్రత్తలు సూచించారు.ప్రతి ఒక్కరూ భౌతికదూరం పాటించి, ప్రభుత్వం సూచించిన నిబంధనలను పాటించాలని ఆయన కోరారు.ఈ కార్యక్రమంలో డిసిసిబి మాజీ డైరెక్టర్ బోయిళ్ళ రమణయ్య,టిఆర్ఎస్ నాయకులు బోయిళ్ళ.రాజు, ఎమ్మార్పీఎస్ మండల కోశాధికారి నల్లగట్ల.రఘు, రెస్టారెంట్ శివ,నైనారపు నాగేశ్వరావు,గద్దల వంశీ, పొడుతూరి నాగరాజు, నరందాసు శ్రీను తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: