మన్యం టీవీ ఏటూరు నాగారం
తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ (టి టి డబ్ల్యూ ఆర్ ఐ ఎస్) ఆధ్వర్యంలోని స్పోర్ట్స్ స్కూల్స్ లో ఐదో తరగతి ప్రవేశాల కోసం నోటిఫికేషన్ విడుదల చేసినట్టు మహబూబాబాద్, ములుగు, భూపాలపల్లి రీజనల్ కోఆర్డినేటర్ రాజ్యలక్ష్మి ఒక ప్రకటనలో తెలిపారు. ఆర్హత కలిగినవారు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ సంస్థ ఆధ్వర్యంలో రెండు పాఠశాలలు కొనసాగుతున్నాయని బాలురు, బాలికల పాఠశాలలో కలిపి మొత్తం 80 సీట్లు అందుబాటులో ఉన్నాయని అన్నారు. ఎంపికైన అభ్యర్థులకు ఉచిత విద్య తో పాటు పిటి డ్రెస్సు, ట్రాక్ సూట్, కిట్ బ్యాగ్ మొదలైనవి అందిస్తారన్నారు. ఏటూరు నాగారం లో బాలుర గురుకుల పాఠశాల, చేగుంట లో బాలికల గురుకుల పాఠశాల ఉన్నాయని పేర్కొన్నారు. ఒక్కో పాఠశాలలో 40 సీట్లు అందుబాటులో ఉన్నాయని అన్నారు. 4వ తరగతి పూర్తయిన విద్యార్థులు అర్హులన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంతంలో అయితే రూ.1.5 లక్షలు, పట్టణ ప్రాంతాలలో అయితే రూ.2 లక్షలు మించకూడదని అన్నారు.
ఎంపిక ప్రక్రియ
ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ ఉంటుందని దరఖాస్తులను ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి అని రిజిస్ట్రేషన్ ఫీజు రూ.50 చెల్లించాల్సి ఉంటుందన్నారు. దరఖాస్తు జూన్ 24 లోపు వెబ్ సైట్ లో చూసుకోవాలన్నారు.
Post A Comment: