CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలను తక్షణమే తగ్గించాలి

Share it:

 



 న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో ధర్నా

 గుండాల    (మన్యం టీవీ)పెంచిన  పెట్రోల్ డీజిల్ ధరలను తక్షణమే తగ్గించాలని న్యూ డెమోక్రసీ పార్టీ ఆధ్వర్యంలో శనివారం ర్యాలీ అనంతరం ధర్నా నిర్వహించారు. అనంతరం న్యూ డెమోక్రసీ జిల్లా నాయకులు ముక్తి సత్యం మాట్లాడుతూ. కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం ఒక్క నెలలోనే 20 సార్లు రేట్లు పెంచి సామాన్యుడి నడ్డి విరుస్తుంది అన్నారు. పెట్రోల్ డీజిల్ ధరలు పెంచడం ద్వారా రవాణా వ్యవస్థ పై ప్రభావం పడి నిత్యావసర వస్తువులతో పాటు అన్ని ధరలు పెరిగి పేద మధ్యతరగతి కుటుంబాలపై పెనుభారం పడుతుందన్నారు. తక్షణమే పెంచిన ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు.  గడిచిన ఆరు నెలలుగా రైతు చట్టాలను రద్దు చేయాలని రైతులు ఢిల్లీలో ధర్నా చేస్తుంటే కేంద్ర ప్రభుత్వం పట్టనట్టు వ్యవహరించడం మంచి పద్ధతి కాదని ఆయన అన్నారు. తక్షణమే రైతు సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో న్యూ డెమోక్రసీ నాయకులు కోరం సీతారాములు, వై వెంకన్న  ,బానోత్ లాలూ  ,పీ వై ఎల్ జిల్లా కార్యదర్శి రవి  ,తదితరులు పాల్గొన్నారు

Share it:

TELANGANA

Post A Comment: