CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

పాస్టర్లకు నిత్యావసర వస్తువుల పంపిణీ

Share it:

 



  ఆళ్ల పల్లి ఎస్ఐ సంతోష్ చేతుల మీదుగా పంపిణీ చేసిన మత పెద్దలు

 గుండాల ఆళ్ల పల్లి  (మన్యం టీవీ)గుండాల ఆళ్ల పల్లి మండలాల్లో  చర్చిలో   పనిచేస్తున్న పాస్టర్లకు  ఆళ్ల పల్లి ఎస్ ఐ సంతోష్ చేతుల మీదుగా నిత్యవసర వస్తువులను పంపిణీ చేశారు. జి టి ఎస్ ఎస్ ఎస్  సంస్థ అధ్యక్షులు బిషప్ జాకబ్, కరుణ సహకారంతో రెండు మండలాల్లోని 38 మంది పాస్టర్లకు 25 కేజీల బియ్యం తో పాటు  కూరగాయలు నిత్యవసర వస్తువులను అందజేశారు. అనంతరం ఎస్ ఐ సంతోష్ మాట్లాడుతూ.  కరోనా కట్టడిలో పాస్టర్లు తమ వంతు  బాధ్యతను చేపట్టాలన్నారు. భౌతిక దూరం పాటిస్తూ మత  బోధనలు చేసేలా చూడాలన్నారు. శానిటైజర్  మాస్కులు తప్పనిసరిగా వాడేలా   వారికి అవగాహన కల్పించాలని ఆయన కోరారు. కరోనాతో ఇబ్బంది పడుతున్న పాస్టర్లను గుర్తించి ఆదుకోవడం ఏమన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాతో పాటు ఖమ్మం సూర్యాపేట మహబూబాద్ ములుగు జిల్లాలో ఉన్న పాస్టర్ లను కూడా ఆదుకోవడం జరిగిందని మత పెద్దలు  పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ రేస్ ఎల్లయ్య , ఏ ఎస్ ఐ సురేష్ , పాస్టర్ రామారావు , అశోక్ ,  డేవిడ్ , జాషువా , ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు

Share it:

Post A Comment: