మన్యం మనుగడ, భద్రాచలం టౌన్:
ఈరోజు జరిగిన గ్రీన్ భద్రాద్రి నూతన కమిటీ మొదటి సమావేశంలో అధ్యక్షులు బోగాల శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ, గత పది సంవత్సరాలుగా గ్రీన్ భద్రాద్రి భద్రాచలంలో అత్యధికంగా మొక్కలు నాటి రాష్ట్ర స్థాయిలో గుర్తింపు పొందదని, అటువంటి గ్రీన్ భద్రాద్రి కి నన్ను అధ్యక్షులుగా నియమించటం చాలా గర్వించదగ్గ విషయమని, ఈ సంవత్సరం అత్యదిక మొక్కలు నాటి భద్రాచలాన్ని పచ్చని భద్రాద్రి గా మారుస్తానని, గ్రీన్ భద్రాద్రి పెద్దలు నాపై ఉంచిన బాధ్యతను, సభ్యులు, పర్యావరణ ప్రేమికులు, పట్టణ ప్రముఖుల సహాయ సహకారాలతో గ్రీన్ భద్రాద్రి కి మరింత ఖ్యాతి తెచ్చేలా కృషి చేస్తానని తెలియజేసారు.
ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ 2021-22సంవత్సరానికి, మొక్కలు నాటుటకు అనువైన స్థల సేకరణ, ఆర్థిక వనరులు సమీకరణ, కడియపు లంక నుండి మొక్కల మొక్కలు కొనుగోలు, ఎదిగిన మొక్కలకు ఉన్న ఇనుప ట్రీగార్డ్స్ ను తీసి కొత్తగా నాటిన వాటికి తిరిగి ఉపయోగించుట తదితర భవిష్యత్ కార్యచరణ పై సుదీర్ఘంగా చర్చింటటం జరిగింది.
గ్రీన్ భద్రాద్రి 2021-22.సంవత్సరానికి ఆర్థిక సమీకరణలో భాగంగా విరాళాలు ఇచ్చిన దాతలు
G.S. శంకర్ రావు గారు ₹10000/-
పల్లింటి దేశప్ప గారు. ₹ 5000/-
గంగాధర వీరయ్య గారు₹ 5000/-
భీమవరపు వెంకట రెడ్డి
గారు ₹ 5000/-
గోళ్ళ భూపతిరావు గారు ₹ 5000/-
గౌతమీ స్పైస్
R. రామకృష్ణారెడ్డి గారు. ₹ 5000/-
భాష్యం రామకృష్ణారెడ్డి గారు.
₹5000/-
ఈ కార్యక్రమంలో గ్రీన్ భద్రాద్రి కార్యదర్శి పామరాజు తిరుమల రావు, కోశాధికారి ఉప్పాడ ప్రసాద రెడ్డి, గ్రీన్ భద్రాద్రి వ్యవస్థాపకులు బొలిశెట్టి రంగారావు, G. రాజారెడ్డి, గౌరవాధ్యక్షులు G.S . శంకర్ రావు గారు, యేగి సూర్య నారాయణ, పల్లింటి దేశప్ప, గోళ్ళ భూపతి రావు, భోణాల నాగ సూర్య నారాయణ, ఉపాధ్యక్షులు కామిశెట్ట కృష్ణార్జున రావు, బెల్లంకొండ రాంబాబు, భీమవరపు వెంకట రెడ్డి, ఉమా శంకర్ నాయుడు, గంగాధర వీరయ్య, పరిమి సోమ శేఖర్, కృష్ణ మోహన్, వీధుల రాంబాబు, తంగేటి కృష్ణ, సంయుక్త కార్యదర్శి శీలం రామ్మోహన్ రెడ్డి, రాము, అన్నెం వెంకటేశ్వర రెడ్డి, రామరాజు, శ్రీదేవి, రాణి తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: