CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

చండ్రుగొండ మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన డిఎంహెచ్ఓ డాక్టర్ శిరీష

Share it:

 



చండ్రుగొండ మన్యం టీవీ ప్రతినిధి :


చండ్రుగొండ మండలం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని శుక్రవారం జిల్లా వైద్య అధికారిని డాక్టర్ శిరీష ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలో ఉన్న రికార్డులను ఫార్మసీ లో ఉన్న స్టాకు వివరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. కోవిడ్ టెస్టుల కోసం వచ్చిన ప్రజల వద్దకు వెళ్లి వారి ఆరోగ్య స్థితులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా కరోనా కేసులు ఉద్ధృతి తగ్గిందని అయినా కూడా వ్యాధి పట్ల నిర్లక్ష్యం చేయకుండా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలన్నారు. కరోనా కేసులు పెరుగుతున్న గ్రామాల్లో ప్రత్యేకంగా మొబైల్ టెస్టింగ్ క్యాంపులను ఏర్పాటు చేసి కోవిడ్ పరీక్షలతో పాటు వారికి కావలసిన మందులను అక్కడే అందించాలని సూచించారు. సిబ్బంది కూడా సమయపాలన పాటిస్తూ వృత్తి ధర్మాన్ని గౌరవిస్తూ ఎవరు వృత్తి వారు నిర్వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల వైద్యాధికారి డాక్టర్ ఎస్ గీత, స్టాఫ్ నర్స్ శంకరమ్మ ఫార్మసీ, లక్ష్మి, ఎల్ టి కిరణ్, ఆస్పత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: