CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

పికపాకలో మాజీ ఎంపీ పొంగులేటి పర్యటన

Share it:

 



టిఆర్ఎస్ నాయకులు భవాని శంకర్ కుటుంబానికి పరామర్శ

 

మన్యం మనుగడ, పినపాక :

 టిఆర్ఎస్ పార్టీ మాజీ ఎంపీ, రాష్ట్ర నాయకులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి తన పర్యటనలో భాగంగా పినపాక మండలం లోని పినపాక గ్రామంలో గల భవాని శంకర్ కుటుంబాన్ని పరామర్శించారు. ఇటీవల కోవిడ్ మహమ్మారి కారణంగా భవాని శంకర్ కుమారుడు రాజా మరణించిన విషయం పాఠకులకు విదితమే. దీనిలో భాగంగా ఆదివారం రోజున భవాని శంకర్ కుటుంబాన్ని పరామర్శించి, ఎల్లవేళలా కుటుంబ సభ్యుని వలె తోడు ఉంటానని భరోసా ఇచ్చి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. అనంతరం తెలంగాణ ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే రేగా కాంతారావు తో కలిసి రాజా చిత్రపటానికి పూలమాల వేయడం జరిగింది. అనంతరం పినపాక మండల టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, ఏడూళ్ల బయ్యారం వాసి అయిన ఉడుముల లక్ష్మారెడ్డి కోవిడ్ బారినపడి కోలుకున్న సందర్భంగా పొంగులేటి ఆయనను కలుసుకుని ఆత్మీయంగా మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పినపాక నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, పినపాక మండల ఎంపిపి గుమ్మడి గాంధీ, డిసిసిబి డైరెక్టర్ తుళ్లూరు బ్రహ్మయ్య, టిఆర్ఎస్ పార్టీ పినపాక మండల అధ్యక్షుడు పగడాల సతీష్ రెడ్డి, పిఎసిఎస్ చైర్మన్ రవి వర్మ, ఆత్మ కమిటీ చైర్మన్ భద్రయ్య, వట్టం రాంబాబు , కీసర శ్రీనివాస రెడ్డి తదితర నాయకులు పాల్గొనడం జరిగింది.

Share it:

TELANGANA

Post A Comment: