మన్యం మనుగడ ,పినపాక:
గ్రామాల్లో పల్లె ప్రగతి పనులు సత్వరమే పూర్తి చేయాలని పినపాక ఎంపీపీ గుమ్మడి గాంధీ అన్నారు. శనివారం మండల పరిధిలోని బోటిగూడెం, ఉప్పాక, సీతంపేట, భూపాలపట్నం గ్రామ పంచాయితీలలో గల వైకుంఠధామం పనులు, పల్లె ప్రకృతి వనాలు, డంపింగ్యార్డులు, నర్సరీలు, పారిశుద్ధ్య పనులు పరిశీలించడం జరిగింది.
ప్రజా ప్రతినిధులు, అధికారులు, గ్రామస్తులతో కలిసి ఆయా గ్రామాల్లో జరుగుతున్న పనులను పరిశీలించారు.
ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ కంది సుబ్బారెడ్డి, ఆత్మ చైర్మన్ పొనుగోటి భధ్రయ్య,
టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు పగడాల సతీష్ రెడ్డి, ముఖ్య నాయకులు దాట్ల వాసుబాబు, కొండేరు రాము, భూపాలపట్నం, సీతంపేట, బోటిగూడెం, ఉప్పాక సర్పంచులు కొర్సా కృష్ణంరాజు , శివశంకర్, సుధాకర్, పూనెం సుజాత, నాయకులు వారా నర్సింహారావు, శ్యామల సతీష్, వాసం స్వాతి, ఎంపీడీఓ శ్రీనివాసులు, గ్రామ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు
Post A Comment: