మన్యం టీవీ మణుగూరు:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు ఓసీ నందు విపిఆర్ కంపెనీలో అప్లోడింగ్ విభాగంలో విధులు నిర్వహిస్తున్న సత్యనారాయణ(51) దురదృష్టవశాత్తు గ్రేడర్ ఢీకొని మృతి చెందడంతో తెలంగాణ ప్రభుత్వ విప్,పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు ఆదేశాలతో టీబీజీకేఎస్ బ్రాంచ్ ఉపాధ్యక్షులు వూకంటి ప్రభాకర్ రావు,మణుగూరు జడ్పిటిసి పొశం నరసింహారావు మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించారు,అనంతరం విపిఆర్ యాజమాన్యంను కలిసి మృతుని కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు. టీబీజీకేఎస్,టిఆర్ఎస్ నాయకులు చేసిన సూచన మేరకు మృతుడి కుటుంబానికి 31 లక్షల రూపాయలు అందించే విధంగా విపిఆర్ యాజమాన్యం అంగీకరించింది.దీంతోపాటు మృతుడి కుటుంబ సభ్యులలో ఒకరికి ఉద్యోగ అవకాశం కల్పించే విధంగా ఓబీ యాజమాన్యం అంగీకరించిందని వారు తెలిపారు.ఓబీ కంపెనీతో చర్చలు జరిపి వారిలో మణుగూరు టీబీజీకేఎస్ ఉపాధ్యక్షులు వూకంటి ప్రభాకర్ రావు,జడ్పిటిసి పోశం నరసింహారావు, టీబీజీకేఎస్ లెవెన్ మెన్ కమిటీ సభ్యులు సామ శ్రీనివాస్ రెడ్డి,జిఎం కమిటీ సభ్యులు కోట శ్రీనివాసరావు మరియు టిఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: