*కరోనా వైరస్ పట్ల అవగాహన కల్పించిన ఎస్ఐ శ్రీకాంత్ రెడ్డి.
మన్యం టీవి ఏటూరు నాగారం
ఏటూరు నాగారం మండల పరిధిలోని సండ్ర గూడెం గుత్తి కోయ గుంపులో బుధవారం ఏటూరు నాగారం ఎస్సై శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. సండ్ర గూడెం లో నివసిస్తున్న కుటుంబాలు వివరాలు సేకరించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్ఐ గుత్తి కోయలు తో మాట్లాడుతూ అపరిచిత వ్యక్తులు ఆశ్రయమిచ్చి ఇబ్బందులు కొని తెచ్చుకోవద్దని నారు. ఎవరైనా కొత్త వ్యక్తులు గూడెం లోకి వస్తే స్థానిక పోలీసులకు సమాచారం అందివ్వాలని సూచించారు. కరోనా వైరస్ పట్ల జాగ్రత్తగా ఉండాలని మాస్కులు ధరించాలని గుత్తి కోయలకు సూచించారు. సివిల్ సీఆర్పీఎఫ్ సిబ్బంది పాల్గొన్నారు.
Post A Comment: