న్యూ డెమోక్రసీ నాయకులు కోరం సీతారాములు
గుండాల (మన్యం టీవీ)బాటన్న ఆశయాలను సాధిస్తామని న్యూ డెమోక్రసీ నాయకులు గుండాల సర్పంచ్ కోరం సీతారాములు అన్నారు . బుధవారం మండల కేంద్రంలోని బాటన్న
స్తూపం వద్ద ఎనిమిదవ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు అనంతరం ఆయన మాట్లాడుతూ. 30 సంవత్సరాలు అజ్ఞాతంలో పనిచేసి అనంతరం మూడు సార్లు ఉమ్మడి గుండాల జెడ్పీటీసీ గా పని చేశారన్నారు .అజ్ఞాతంలో ఉన్నప్పుడు ప్రజల కోసం వెలలేని కృషి చేశారన్నారు. జెడ్పీటీసీ గా గెలుపొందిన తర్వాత కూడా ప్రజా పోరాటాల్లో ముందుండి నాయకత్వం చేస్తూ ప్రజా సమస్యలను తీర్చేవిధంగా పని చేశారన్నారు . ముఖ్యంగా కరెంటు లేక ఇబ్బంది పడుతున్న గుండాల మండల ప్రజల కోసం ఎన్నో పోరాటాలు చేసి కరెంటు తీసుకు వచ్చారన్నారు. అదేవిధంగా ఇల్లందు నుండి గుండాల వరకు రహదారి కోసం పోరాటాలు చేసి రహదారి సౌకర్యాన్ని సాధించారని వారు అన్నారు ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ పనిచేయాలని పిలుపునిచ్చారు . ఈ కార్యక్రమంలో పీ వై ఎల్ జిల్లా ప్రధాన కార్యదర్శి రవి , వై వెంకన్న ,లాలయ్య ,ఈసం కృష్ణ ,ఉప సర్పంచ్ మానాల ఉపేందర్ ,కోడూరి జగన్ ,గడ్డం రమేష్ తదితరులు పాల్గొన్నారు
Post A Comment: