మన్యం మీడియా, అన్నపురెడ్డిపల్లి:: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అన్నపురెడ్డిపల్లి మండలం, ఎర్రగుంట గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద వైద్య సిబ్బంది నల్లబ్యాడ్జీలు ధరించి నిరసనలు తెలియజేశారు. వైద్య-ఆరోగ్య ఉద్యోగుల సంఘాల ఐక్యవేదిక తరపున రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చిన వినతి పత్రం పై సానుకూల స్పందన రానందున, ఐక్య వేదిక రాష్ట్ర ప్రతినిధులు పిలుపు మేరకు నేషనల్ హెల్త్ మిషన్, కాంట్రాక్ట్ , ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల వేతనాలు పెంచాలని, కరోనా తో చనిపోయిన వైద్య సిబ్బంది కుటుంబాలకు కోటి రూపాయల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించాలని, యుద్ధ ప్రాతిపదికన వైద్య సిబ్బంది కుటుంబాలకు కోవిడ్ టీకాలు వెయ్యాలని, సమస్యలు పరిష్కరించాలని. రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతూ నల్లబ్యాడ్జీలు ధరించి నిరసనలు వ్యక్తపరిచారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ప్రియాంక, వైద్య సిబ్బంది-కిరణ్, నాగజ్యోతి,నాగమణి, పుల్లమ్మ, తదితర సిబ్బంది అందరూ పాల్గొన్నారు.
Post A Comment: