మన్యం టీవీ, అశ్వాపురం:
జగ్గారం లోని రైతులు చేన్లకు వెళ్లే ప్రధాన రహదారికి సరిఅయిన రోడ్డు సౌకర్యం లేక వర్షాకాలంలో మోకాటిలోతు బురదలో చేన్లకు ఎరువులు కూలీలు వెళ్ళాలి అంటే ఇబ్బందులు పడుతున్నారు ఇటీవల రైతులు స్థానిక అశ్వాపురం మండల ఎంపీపీ ముత్తినేని సుజాత ని కలిసి వివరించగా స్పందించిన ఎంపీపీ తన మండల ప్రజా పరిషత్ నిధులనుంది సుమారు ఐదు ఆరు లక్షలు కేటాయించి రోడ్డు పనులకు ఈ రోజు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో స్థానికి సర్పంచ్ సున్నం రాంబాబు, గ్రామస్తులు కంసాని సత్యనారాయణ, గాలి బ్రహ్మానంద రెడ్డి ,గుండ్రేడ్డి శ్రీనివాస్ రెడ్డి, ముసుకు ఏసు తదితరులు పాల్గోన్నారు.
Post A Comment: