మన్యం టీవీ కొత్తగూడెం:-
నిషేధిత సీపీఐ మావోయిస్ట్ పార్టీ నేతలు యాప నారాయణ@హరిభూషన్ మరియు సిద్దబోయిన సారక్క@భారతక్కలు కరోనా వైరస్ సోకి మరణిచించినట్లు మావోయిస్ట్ పార్టీ ఈ రోజు ఒక లేఖను విడుదల చేశారు.ఇటీవల మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ నాయకులు మరియు సభ్యులు మావోయిస్ట్ పార్టీలో కరోనా వైరస్ ఎవరికీ సోకలేదని తప్పుడు ప్రకటనలను విడుదల చేశారు.మావోయిస్ట్ పార్టీలో కరోనా సోకిన నాయకులకు తప్పుడు వైద్య చికిత్సను అనుసరించి వారు ప్రాణాలను కోల్పోవడానికి మావోయిస్ట్ పార్టీ అగ్రనాయకులే కారణమవుతున్నారు.కరోనా సోకిన క్రింది స్థాయి నాయకుల మరియు సభ్యుల ఆరోగ్యాల పట్ల మావోయిస్ట్ పార్టీ ఏ మాత్రం పట్టించుకోవడం లేదు.సరైన వైద్యం కొరకు బయటకు వద్దామనుకునేవారిని అడ్డుకుంటూ అగ్ర నాయకులు మానవ హక్కుల ఉల్లంఘనలకు పాల్పడుతున్నారు. ఇప్పటికైనా ఆలస్యం చేయకుండా మావోయిస్ట్ పార్టీలో కరోనా వైరస్ సోకి ఆరోగ్య సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొనే నాయకులు,సభ్యులు ఎవరైనా ఉంటే వెంటనే పోలీసువారికి లొంగిపోయి మెరుగైన వైద్య చికిత్సలు పొంది తమ ప్రాణాలను కాపాడుకోవాల్సిందిగా జిల్లా ఎస్పీ సునీల్ దత్ ఐపీఎస్ నేడు తెలియజేశారు.
Post A Comment: