అంత్యక్రియలు నిర్వహించిన సిపిఎం హెల్ప్ లైన్
మన్యం టీవీ: ఇల్లందు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం 21 పిట్ ఏరియాలో మెలుగు మల్లమ్మ (66) గుండెపోటుతో మృతి చెందింది. స్థానికులు కరోనా నేపథ్యంలో మేము అంత్యక్రియలు నిర్వహించలేమని చేతులెత్తేశారు. కుటుంబ సభ్యులు సిపిఎం హెల్ప్ లైన్ బాధ్యులను అంత్యక్రియలు నిర్వహించమని కోరారు. వారి ఆధ్వర్యంలో అంత్యక్రియలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో లో అబ్దుల్ నబి, తాళ్లూరి కృష్ణ, ఆలేటి కిరణ్, కారం సంజీవయ్య అంత్యక్రియలు పూర్తి చేశారు. విజయలక్ష్మి నగర్ ఉప సర్పంచ్ తాండ్ర నాగరాజు, ఎంపీటీసీ పి సురేందర్ సహాయ సహకారాలు అందించారు. గుగ్గిళ్ళ యాదగిరి, కారం అశోక్, సంపత్, శ్రీను కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
Post A Comment: