మన్యం టీవీ,మణుగూరు: బహుజన్ సమాజ్ పార్టీ పినపాక నియోజకవర్గ అధ్యక్షులుగామణుగూరు పైలట్ కాలనీ కి చెందిన పిల్లి అఖిల్ కుమార్ ను నియమిస్తూ జిల్లా అధ్యక్షులు యెర్రా కామేష్ గురువారం నియమకపత్రం అందజేశారు. ఈ సందర్భంగా అఖిల్ మాట్లాడుతూ దేశ జనాభాలో 85 శాతం పైన ఉన్న బహుజన్ లు రాజ్యాధికారనికి దూరం అవుతున్నరంటే వారికి అవగాహన లేకపోవడమేనని బహుజన్ లకు రాజ్యాధికారమే లక్ష్యంగా నియోజకవర్గ పరిధిలోని ప్రతి మండలంలో పర్యటించి బూత్ స్థాయి నుండి కమిటీలు వేసి పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని నాపై నమ్మకంతో నాకు బాధ్యత అప్పగించిన రాష్ట్ర అధ్యక్షులు మంద ప్రభాకర్ గారికి, మహబూబాద్ పార్లమెంటు కో ఆర్డినేటర్ ఈర్ప కమరాజు గారికి జిల్లా అధ్యక్షులు యెర్రా కామేష్ గారికి కృతజ్ఞతలు తెలిపారు.
పిల్లి అఖిల్ నియామకం పట్ల వేమూరి రఘు,బుయ్యనా శంకర్,చెలికాని.సాంబశివరావు, పవన్ తదితరులు అభినందనలు తెలిపారు.
Post A Comment: