మన్యం మనుగడ, పినపాక:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, పినపాక మండలం, జానంపేట గ్రామంలో అభయ్ దళిత్ సేవా సొసైటీ ఆధ్వర్యంలో డాక్టర్ బి ఆర్ అంబెడ్కర్ విగ్రహా నిర్మాణం కొరకు గ్రామ పంచాయతీ స్థలాన్ని పరిశీలించి, కేటాయించడం జరిగింది. ఈ సందర్భంగా విగ్రహ నిర్మాణం కొరకు భూమి పూజ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పంచాయితీ సర్పంచ్ మహేష్, పిఎసిఎస్ చైర్మన్ రవి వర్మ, ఎంపీటీసీ హరీష్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు కుమ్మరి వెంకటేశ్వర్లు, ఉపాధ్యక్షుడు వరికిల్ల వీర్రాజు, జనరల్ సెక్రటరీ రాంటెంకి బాబురావు, కోశాధికారి మాదరి రాజు, బుడుగుల శ్రీను, బోడ సర్వేష్, వరికిల్ల శ్రీను, బండెల కన్నారావు, జీవన్, ముత్యం, వినయ్, దేపాక శివ, కామేశ్వర రావు, గుమస్తా నరసింహారావు, లు పాల్గొన్నారు.ఈ సందర్భంగా అభయ్ దళిత్ సేవా సొసైటీ జానంపేట, అధ్యక్షుడు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ అంబేడ్కర్ ఆశయాలు , సేవ కార్యక్రమాలు కొనసాగుతాయి అని అన్నారు.
Post A Comment: