🔥జెడ్పిటిసి కామిరెడ్డి శ్రీలత
మన్యం మనుగడ, భుర్గంపాడ్:బూర్గంపహాడ్ మండలం సారపాక రెవెన్యూ పరిధిలో గల 262 సర్వే నెంబర్ లో దళిత గిరిజనులు గత 40 సంవత్సరాలుగా సాగు చేసుకుంటున్న భూమిలో అటవీ అధికారులు కందకాలు తీసి మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టడంతో విషయం తెలుసుకున్న గ్రామస్తులు,పోడు భూమి రైతులు వెంటనే బూర్గంపహాడ్ జడ్పీటీసీ కామిరెడ్డి శ్రీలత గా మరియు మండల టిఆర్ఎస్ నాయకుల దృష్టికి తీసుకెళ్లాగా జడ్పీటీసీ కామిరెడ్డి శ్రీలత , మండల టిఆర్ఎస్ అధ్యక్షులు గోపిరెడ్డి రమణ రెడ్డి ఆ ప్రాంతానికి చేరుకొని పోడు భూమి రైతుల తరుపున బూర్గంపాహాడ్ తహశీల్దార్ బి.భగవాన్ రెడ్డి , అటవీ అధికారులకు జాయింట్ సర్వే చేసిన తర్వాతే మొక్కలు నాటాలని కోరడంతో అటవీ అధికారులు అక్కడ నుంచి వెళ్లి పోవడం జరిగింది.ఈ కార్యక్రమంలో నాగినేనిప్రోలు రెడ్డిపాలెం ఉపసర్పంచ్ యడమకంటి ఝాన్సీరాణి గారు,సి పి ఐ పట్టణ కార్యదర్శి మువ్వ వెంకటేశ్వర రావు నాయకులు సాలయ్య,గ్రామస్తులు,పోడు భూమి రైతులు,మహిళలు పాల్గొన్నారు.
Post A Comment: