మన్యం టీవీ,అశ్వాపురం:ఈ రోజు గొల్లగూడెం గ్రామపంచాయితీ సర్వాయిపాడుబంజర్ గ్రామంలో 30 మంది కరోనా పేషెంట్ లకు ఇటుకలబట్టీ వ్యాపార యజమాని వడ్డెంపూడీ రాము వారి తల్లి జ్ఞాపకార్ధముగా నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరిగింది. అలాగే గత రెండు రోజుల క్రితం కరోనా వచ్చి చనిపోయిన సోడె కామయ్య గారి కుటుంబానికి దశదిన కర్మల ఖర్చుల నిమిత్తం 2000/- రూపాయిలు నగదు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ పొడియం సుజాత , ఉపసర్పంచ్ బొల్లినేని గణేష్ ,మాజీ సర్పంచ్ పొడియం అనిల్ కుమార్, టి,ఆర్,యస్ మండల నాయకులు బొబ్బాల నాగేశ్వరరావు గారు గ్రామ యువత తంగెళ్ల కళ్యాణ్,ఇర్పా వీరభద్రం,సోడె.రాజు,సోడె కళ్యాణ్,పాయం ధర్మరాజు తదితరులు పాల్గోన్నారు ఇంత గొప్ప మనస్సుతో సహయం చేసిన వడ్డెంపూడీ రాము సర్పంచ్ మరియు పాలకవర్గ సభ్యులు గ్రామస్తులు ప్రత్యేకంగా అభినందించి ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది.
Post A Comment: