మన్యం టీవీ కరకగూడెం.
కరకగూడెం మండల పరిధిలో అనంతారం గ్రామ పంచాయతీ లోని నర్సరీలను పల్లె ప్రకృతి వనాలను సందర్శించిన మండల స్పెషల్ అధికారిణి భద్రాచలం ఐటిడిఏ డి డి రమాదేవి సందర్శించారు. ఈ సందర్బంగా అమె మాట్లాడుతూ వృక్షో రక్షిత రక్షిత: అన్నట్లు మొక్కలను మనం నాటి పెంచితే అవి మనకు మన భావితరాలకు తరగని రక్షణను కల్పించి మనల్ని ఆరోగ్యవంతులుగా ఉండేందుకు దోహద పడతాయి, మొక్కలు, చెట్లను కాపాడితే మనకు ప్రాణ వాయువును, ఫలాలను, నీడను అందించి వాయు కాలుష్యాన్ని తగ్గిస్తాయి. ఇన్ని ప్రయోజనాలు ఉన్న చెట్లను కాపాడుకోవాలి మన భవిష్యత్ కాపాడుకోవాలి అంటూ ఈ సందర్బంగా మొక్కలు నాటడమే కాకుండా వాటిని కాపాడాలని సూచనలు చేసారు.
Post A Comment: