మన్యం మనుగడ,భద్రాచలం టౌన్:
ఈ నెల ఎనిమిదో తేదీన భూపతి రావు కాలనీలో నివాసం ఉంటున్న సుదర్శన్ అనే యువకుడు గుండెపోటుతో మృతి చెందాడు .అతని మృతదేహానికి దహణసంస్కారాలు చేయడానికి ఎవరు ముందుకు రాకపోవడంతో
రక్షణ సేవ ఫౌండేషన్సభ్యులు అంత్యక్రియలు నిర్వహించి ఆర్థిక సహాయం అందజేశారుచే.
కుటుంబానికి పెద్ద దిక్కైన సుదర్శన్ మృతి చెందడంతో ఆ కుటుంబ సభ్యులు దిక్కుతోచని స్థితిలో ఉండడంతో
రక్షణ సేవ ఫౌండేషన్ వారు 25 కేజీల బియ్యం నిత్యావసర సరుకులు వితరణ గా అందించి...మానవత్వం చాటుకున్నారు.ఆ కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
Post A Comment: