మన్యం మనుగడ,పినపాక :
గ్రామాల్లో వైకుంఠధామం పనులు వెంటనే పూర్తి చేయాలని పినపాక ఎంపీపీ గుమ్మడి గాంధీ అన్నారు.
సోమవారం మండల పరిధిలోని
ఏడూళ్లబయ్యారం, ఎల్చిరెడ్డిపల్లి, పాతరెడ్డిపాలెం, వెంకట్రావ్పేట, జగ్గారం గ్రామ పంచాయితీలలో పర్యటించారు.
ఈ సందర్భంగా అన్ని గ్రామాల్లో వైకుంఠధామం పనులు వెంటనే పూర్తి చేయాలన్నారు. అదేవిధంగా వైకుంఠధామం, డంపింగ్యార్డు, పల్లెప్రకృతి వనాలకు గ్రావెల్ రోడ్డు నిర్మాణం చేపట్టాలన్నారు. గ్రామాల్లో పారిశుద్ధ్య పనులు నిత్యం చేపట్టాలన్నారు.
ఈ కార్యక్రమంలో
టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు పగడాల సతీష్ రెడ్డి, రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షుడు దొడ్డా శ్రీనివాసరెడ్డి, సొసైటీ వైస్ చైర్మన్ బత్తుల వెంకటరెడ్డి, ముఖ్య నాయకులు పోలిశెట్టి సత్తిబాబు, బాలకృష్ణ, సర్వేశ్వరరావు,
సర్పంచ్లు కోరం రజిని, నూప నాగభూషణం, వెంకన్న, గుమ్మడి అనంత, గ్రామ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: