ఆదివాసి గ్రామాలకు నిత్యావసరాల పంపిణీ
మన్యం మనుగడ, పినపాక:
హైదరాబాద్ ప్రాంతానికి చెందిన స్వచ్ఛంద సంస్థలు అయిన ఎస్ ఎస్ సి, ఈ జె.డి, లెర్నింగ్ స్పేస్ ఫౌండేషన్ ల ఆధ్వర్యంలో పినపాక మండలం లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు అయిన జానంపేట, పినపాక తో పాటు కరకగూడెం మండలం లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నకు, మంగళవారం రోజున పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు ప్రారంభించిన గడ్డంపల్లి లోని ఐసోలేషన్ కేంద్రానికి 30 కిట్ల చొప్పున, జ్వరాన్ని పరీక్షించే పరికరాలు, మాస్కులు, శానిటైజర్లు మొదలగు వాటిని పంపిణీ చేయడం జరిగింది. అంతేకాకుండా పినపాక మండలం లోని ఆదివాసీ గ్రామాలైన టేకులగూడెం, చింతలపాడు లలో ప్రతి ఇంటికి నిత్యావసర సరుకులు అందజేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో రాబిన్ హుడ్ సంస్థ వాలంటీర్ రాము, రాజేష్ కుమార్, పినపాక మండలం ఎంపీపీ గుమ్మడి గాంధీ, గడ్డం పల్లి సర్పంచ్ సునీల్ కుమార్, పంచాయతీ సెక్రటరీ అజార్, జానంపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యులు డాక్టర్ శృతి, పినపాక మండల ఆదివాసి ఐక్యవేదిక అధ్యక్షుడు తోలెం శ్రీనివాస్, పినపాక మండలం మన్యం మనుగడ విలేఖరి దొడ్డి శ్రీనివాస్, ఆయా గ్రామాల ఆదివాసీలు పాల్గొన్నారు.
Post A Comment: