CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

అన్నపురెడ్డిపల్లి మండలంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు సంబరాలు

Share it:

 


(తెలంగాణ రాష్ట్ర పిసిసి చీఫ్ గా రేవంత్ రెడ్డిని నియమించడంతో సంబరాలు చేసుకున్న కాంగ్రెస్ పార్టీ అన్నపురెడ్డిపల్లి మండల నాయకులు,కార్యకర్తలు)

 

మన్యం మీడియా, అన్నపురెడ్డిపల్లి::మండల పరిధిలోని భీమునిగూడెం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ అన్నపురెడ్డిపల్లి మండల అధ్యక్షులు బాణవత్ భీముడు.భీమునీగూడెం గ్రామ పంచాయతీ సర్పంచ్ మడకం పొత్తమ్మ  ఆధ్వర్యంలో బాణాసంచా కాల్చి, స్వీట్లు పంచి పెట్టి, సంబరాలు నిర్వహించారు.ఈ సందర్భంగా భీముడు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన సోనియాగాంధీ...రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులను గమనించి,పార్టీని పటిష్ఠంగా  పునర్నిర్మాణం చేయాలనే సంకల్పంతో,యువ నాయకుడు రేవంత్ రెడ్డిని టీపీసీసీ చీఫ్ గా నియమించడం. పార్టీకి పునర్వైభవం తెచ్చింది అని.రేవంత్ రెడ్డి అధ్యక్షతన  పార్టీ పునర్నిర్మాణంలో భాగస్వాములు అవుతామని, అధికార పార్టీ చేస్తున్న ఒంటెద్దు పోకడలను ప్రజల్లోకి తీసుకెళ్లి, అధికార టీఆర్ఎస్ పార్టీని, ప్రజల్లో ఎండగడతామని తెలిపారు. అలాగే రేవంత్ రెడ్డికి టిపిసిసి పదవి ఇచ్చినందుకు సోనియా గాంధీ,రాహుల్ గాంధీలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపఅధ్యక్షులు ముద్రగడ వెంకటేశ్వర్లు, సడియం రాఘవులు, కొండూరు నర్సింహారావు, బొల్లిపోగు వేంకటేశ్వరరావు, యాకూబ్ ఫాష, షేక్ సుభాని, మీడియం రాంబాబు, ఎస్డి అహ్మద్, చల్లా పుల్లయ్య, మడకం వెంకటేశ్వర్లు, చెరుకూరి ప్రసాద్, బాన్నె శ్రీను, గుడిమెట్ల ఉపేందర్, తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: