మన్యం టీవీ,బూర్గంపాడు:
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లెప్రగతిలో భాగంగా వేపలగడ్డ,నకిరిపేట,లక్ష్మీపురం గ్రామ పంచాయతీలలోని పల్లె ప్రకృతి వనాలను, వైకుంట ధామాలను,డంపింగ్ షెడ్డులను,నర్సరీలను సందర్చించిన బూర్గంపాడు జడ్పీటీసీ కామిరెడ్డి శ్రీలత, ఎంపీడీఓ వివేక్ రామ్, మండల పంచాయతీ అధికారి శ్రీనివాసరావు,మండల టిఆర్ఎస్ అధ్యక్షులు గోపిరెడ్డి రమణ రెడ్డి.
అనంతరం రానున్న వర్షాకాలం నేపథ్యంలో గ్రామాలలో వీధి వీధి తిరుగుతూ డ్రైనేజీలలోని పూడిక మట్టిని త్వరగా తీయించాలని ఆయా గ్రామ సర్పంచ్ లను,సెక్రటరీలను కోరారు.
ఈ కార్యక్రమంలో స్థానిక గ్రామ పంచాయతీ సర్పంచ్ లు కుంజా చిన్నభాయ్,చర్పా వెంకటేశ్వర్లు,భూక్య సుజాత,సోంపాక నాగమణి స్థానిక ఉప సర్పంచ్ లు బోళ్ల శ్రీశైలం,స్థానిక వార్డుసభ్యులు పాలం దివాకర్ రెడ్డి, వీరబాబు, సొసైటీ డైరెక్టర్ మేడగం రామిరెడ్డి,స్థానిక పంచాయతీ సెక్రటరీలు,స్థానిక టిఆర్ఎస్ గ్రామ కమిటి అధ్యక్షులు పోతిరెడ్డి గోవింద రెడ్డి,బోళ్ల వెంకన్న,స్థానిక టిఆర్ఎస్ నాయకులు నల్లమోతు సురేష్,బండారి లక్ష్మీనారాయణ మరియు మల్సూర్,భూక్య శ్రీను మరియు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: