CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ప్రజా ప్రతినిధులు కు గౌరవ వేతనాలు పెంపు పట్ల హర్షం, పాలాభిషేకం

Share it:

 


మన్యం టీవీ, మణుగూరు:

ఈరోజు మణుగూరు మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో జడ్.పి.టి.సి లకు,ఎం.పి.టి.సి లకు,సర్పంచ్ లకు గౌరవ వేతనం 30 % పెంచిన సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్ర పటానికి మండలం లోని ప్రజా ప్రతినిధులు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా జడ్.పి.టి.సి ల సంఘం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు పోశం.నరసింహారావు ,ఎం.పి.టి.సి ల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి గుడిపూడి. కోటేశ్వరరావు లు మాట్లాడుతూ ఈ కరోనా విపత్కర పరిస్థితుల్లో కూడా ప్రజాప్రతినిధుల పట్ల ప్రేమతో,సానుభూతి తో గౌరవ వేతనాలు పెంచినందుకు హర్షం వ్యక్తం చేశారు. అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్ర పటానికి పాలాభిషేకం నిర్వహించారు. గౌరవ వేతనం పెంచిన ముఖ్యమంత్రి కేసీఆర్ , అందుకు సహకరించిన ఎం.ల్.సి కల్వకుంట్ల కవిత ,ప్రభుత్వ విప్,ఎం.ల్.ఏ రేగా.కాంతారావు ఎం.పి.టి.సి ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గడిల .కుమార్ గౌడ్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియ జేశారు.

ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ పో శం.నరసింహారావు,ఎంపీటీసీ ల సంఘం జిల్లా నాయకులుగుడిపూడి. కోటేశ్వరరావు ల తో పాటు వైస్ ఎం.పి.పి కరివేద.వెంకటేశ్వరావు,సర్పంచ్ ల సంఘం మండల అధ్యక్షుడు ఏ నిక.ప్రసాద్,ఎం.పి.టి.సి లు బే గా.రమ్య,కణితి.బాబురావు,పాయం.లక్ష్మయ్య,కోఆప్షన్ మెంబర్ జావేద్ పాషా,సర్పంచ్ లు కారం.ముత్తయ్య,జంపేశ్వరి, తాటి.రామకృష్ణ,రాంబాబు, మైనార్టీ నాయకులు హాబీబ్ పాషా తదితరులు పాల్గొని హర్షం వ్యక్తం చేశారు.

Share it:

TELANGANA

Post A Comment: