CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

నకిలీ విత్తనాలను విక్రయించే వారిపై ప్రత్యేక నిఘా

Share it:

 


👉 క్రిమినల్ కేసులను నమోదు చేస్తాము

👉కరకగూడెం ఎస్ఐ జీ. ప్రవీణ్ కుమార్

మన్యం టీవీ, కరకగూడెం:

మండలంలో రైతులకు నష్టం కలిగించే విధంగా ఎవరైనా నకిలీ విత్తనాలను,అనధికారిక విత్తనాలను విక్రయించే వారిని ఉపేక్షించేది లేదు,సంబంధిత డీలర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తాము.

 గతంలో నకిలీ విత్తనాలను విక్రయించి అరెస్ట్‌ అయినవారి వివరాలు,నకిలీ విత్తనాల వల్ల నష్టపోయిన రైతులు,పంట నష్టం,విక్రయదారుల సమాచారాన్ని సేకరించి ప్రత్యేక నిఘా పెడుతున్నాము. వ్యవసాయశాఖ అధికారుల తోడ్పాటుతో పోలీసు శాఖ కట్టుదిట్టమైన నిఘా చర్యలు చేపట్టుతున్నాము.

నకిలీ విత్తనాలను నిరోధించడానికి  మండల స్థాయిలో టాస్క్‌ఫోర్స్‌ బృందాలను ప్ర త్యేకంగా నియమించామని నకిలీ విత్తనాలు అమ్మే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోని పిడి యాక్ట్ లు నమోదు చేస్తాం.ఇట్టి విధుల్లో భాగంగా ఈరోజు కరకగూడెం మండలం అనంతారం గ్రామంలో ఫెర్టిలిజెర్స్ అండ్ సీడ్స్ షాప్ లని తనిఖీ చేయడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో జి. ప్రవీణ్ కుమార్, సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, కరకగూడెం, జి. వినయ్, కరకగూడెం మండల వ్యవసాయ అధికారి, యూ. అనిల్,కె. ప్రశాంత్ అగ్రికల్చర్ ఎక్సటెన్స్ ఆఫీసర్ మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: