మన్యంటీవీ, అశ్వారావుపేట:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం నందు ఐటీడిఏ పీవో గౌతమ్ ని మర్యాదా పూర్వకంగా కలిసి మండలంలోని పలు సమస్యలపై వినతి పత్రాన్ని అందజేసినా అశ్వారావుపేట మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు జల్లిపల్లి శ్రీరామ మూర్తి. అశ్వారావుపేట పట్టణం మరియు వినాయకపురం గ్రామంలో ఉన్న ప్రభుత్వ వైద్య శాలలో హాస్పిటల్ కి వచ్చిన పేషెంట్లకు కూర్చోవడానికి సెడ్ ఏర్పాటు చేయాలని, హాల్ లేనందున వచ్చినా వారు కూర్చోవడానికి ఇబ్బంది పడుతున్నారని, అలాగే హాస్పిటల్స్ చుట్టూ ప్రహరీ గోడ లేనందున హాస్పిటల్ లోకి గేదెలు, పందులు వస్తున్నాయని, కాబట్టి హాస్పిటల్ లో వెయిటింగ్ హాల్ మరియూ ప్రహరీ గోడ నిర్మించాలని తెలిపారు. అలాగే అశ్వారావుపేట మండలలోని ఆసుపక గ్రామ పంచాయతీ లోని ఇందిరా సాగర్ ప్రాజెక్ట్ లో కట్టించిన ఇళ్ళు ఎవరికి ఇవ్వకుండా ఉండడం వలన అవీ శిథిలావస్థకు చేరుకున్నాయి, కావునా వాటిని ఆ గ్రామానికి చెందిన నిరుపేద గిరిజనులకు అందచేయగలరని కోరుతూ పీఓ గౌతమ్ కి వినతి పత్రం అందజేసిన అశ్వారావుపేట ఎంపీపీ జల్లిపల్లి శ్రీరామమూర్తి. దీనికి వెంటనే స్పందించిన పీఓ గౌతమ్ వెయిటింగ్ హాల్ తక్షణమే నిర్మిస్తానని అలాగే ప్రహరీ గోడ నిర్మాణానికీ కూడ నిధులు రాగానే మంజూరు చేస్తా అనీ తెలపటం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు బండారు శ్రీను పాల్గొన్నారు.
Post A Comment: