మన్యం టీవీ,సుజాత నగర్: సుజాతనగర్ అభివృద్ధిలో భాగంగా సుజాతనగర్ సెంటర్ నుండి రాఘవాపురం పోయే రోడ్డు వరకు నడుస్తున్న సి సి రోడ్డు పనులను ఆకస్మికంగా తనిఖీ చేసి, నాణ్యతను పరిశీలించిన కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే వనమా మాట్లాడుతూ సుజాతనగర్ ను సుందరంగా తీర్చి దిద్దటం తన లక్ష్యమని, సి సి రోడ్డు నిర్మాణం వల్ల ప్రజలకు ఎంతగానో ఉపయోగం ఉంటుందని, సుజాతనగర్ అభివృద్ధి కోసం ఎన్ని నిధులు అయినా తీసుకువస్తానని, ముఖ్యమంత్రి కేసీఆర్ గారి సహకారంతో కొత్తగూడెం నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే నెంబర్వన్ నియోజకవర్గంగా ఉంచటమే తన లక్ష్యమని అన్నారు.
ఎమ్మెల్యే వనమా వెంట జిల్లా జడ్పీ వైస్ చైర్మన్ కంచర్ల చంద్రశేఖర్ రావు, ఆత్మ కమిటీ చైర్మన్ బత్తుల వీరయ్య, ఎంపిపి లు భూక్యా విజయలక్ష్మి, బాదావత్ శాంతి, కొత్తగూడెం మార్కెట్ కమిటీ చైర్మన్ భూక్యా రాంబాబు, డైరెక్టర్ బోడా హరి, టిఆర్ఎస్ మండల ప్రెసిడెంట్ లింగం పిచ్చి రెడ్డి, టిఆర్ఎస్ నాయకులు బత్తుల రమేష్, గాజుల సీతారామయ్య, శోభన్, సంకుబాపన అనుదీప్ మరియు స్థానిక టిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Post A Comment: