ముందస్తు ప్రణాళిక రూపొందించండి
ఎంపీపీ ముక్తి సత్యం
గుండాల ( మన్యం టీవీ) సీజనల్ వ్యాధుల పట్ల ముందస్తు ప్రణాళిక రూపొందించాలని అలాగే అప్రమత్తంగా వ్యవహరించి ప్రజలు రోగాల బారిన పడకుండా చర్యలు చేపట్టాలని గుండాల ఎంపీపీ ముక్తి సత్యం అధికారులకు సూచించారు. శనివారం మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో అధికారులతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించి అధికారులకు ప్రజాప్రతినిధులకు తగు సూచనలు చేశారు. సర్పంచులు కార్యదర్శులు పారిశుద్ధ్య పనులపై ప్రత్యేక ప్రణాళికలు రూపొందించుకొని డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తం లేకుండా చూడాలని ఆయన కోరారు. ప్రతి శుక్రవారం పారిశుద్ధ్యంపై అవగాహన కార్యక్రమం ఉంటుందని ఆయన సూచించారు. డ్రైనేజీ లో మురికి నీరు పూడిక లేకుండా తొలగించాలని ఆయన కోరారు. గ్రామాల్లో మురికి నీరు లేకుండా కొబ్బరి బోండాలు టైర్లలో నీళ్ళు నిల్వ ఉండకుండా ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ప్రజలు రోగాల బారిన పడకుండా ఉండేందుకు వారికి అవగాహన కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో అలీ హజరత్, జెడ్ పి టి సి రామక్క ,తాసిల్దార్ రంగు రమేష్ , వైద్యాధికారి రవి చంద్ ,ఎంపీటీసీ సంధాని ,కృష్ణారావు ,సర్పంచులు ,కార్యదర్శులు పాల్గొన్నారు
Post A Comment: