CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ముమ్మరంగా పారిశుద్ధ్య పనులు

Share it:

 


 సైడ్ కాలువల పూడికతీత పనులు. ఏటూర్ నాగారం సర్పంచ్ ఈసం రామ్మూర్తి.

మన్యం టీవీ ఏటూరు నాగారం

మండల కేంద్రంలో ముమ్మరంగా పారిశుద్ధ్య పనులు సైడ్ కాలువల పూడికతీత పనులు ఏటూర్ నాగారం మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ ఈసం రామ్మూర్తి ఆధ్వర్యంలో కొనసాగుతున్నాయి.జూన్ వర్షాకాల సీజన్ ప్రారంభం కావడంతో ముందస్తు చర్యల్లో భాగంగా సమస్యాత్మక ప్రాంతాలను ముందుగానే గుర్తించి వర్షాకాలం సీజన్ లో గ్రామ ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోకుండా ఉండేందుకు చర్యలు చేపట్టనున్నట్లు.సైడు కాలువలో మురికినీరు పేరుకుపోయి ప్రజలు వివిధ రోగాల బారిన పడకుండా ఉండేందుకు గ్రామ పంచాయతీ సిబ్బంది మరియు ప్రైవేటుగా కార్మికులను ఏర్పాటు చేసి యుద్ధ ప్రాతిపదికన సైడు కాలువలో పేరుకుపోయిన మట్టిని తీస్తున్నట్లు,కరోనా మహమ్మారి తీవ్రంగా విజృంభిస్తుండడంతో గ్రామ ప్రజలు తమ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని, ప్రతిరోజు చేతులు శుభ్రంగా కడుక్కోవాలి అని,సామాజిక దూరం పాటించాలని, మాస్కులు ధరించాలని, అత్యవసరమైతే తప్ప బయటికి రాకూడదని కరోనా నిబంధనలను పాటిస్తూ తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని గ్రామ సర్పంచ్ ఈసం రామ్మూర్తి తెలిపారు.

Share it:

Post A Comment: