👉రవాణా మంత్రి పువ్వాడ కి విన్నవించిన విప్ రేగా
👉తక్షణమేనిధుల మంజూరు కు కలెక్టర్ ను ఆదేశించిన మంత్రి
👉ఫలించిన రేగా కృషి
మన్యం టీవీ, మణుగూరు:పినపాక అభివృద్ధి కి కంకణం కట్టుకున్న విప్,పినపాక శాశన సభ్యులు రేగా కాంతారావు ...నిధుల మంజూరు కు భగీరథ ప్రయత్నం చేసి నియోజకవర్గ అభివృద్ధి కి అహర్నిశలు కృషి చేస్తున్నారు. పినపాక నియోజకవర్గ అభివృద్ధికి వేలకోట్ల నిధులు తీసుకురావడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో మణుగూరు బస్టాండ్ గత పాలకుల నిర్లక్ష్యంతో బురద మయంగా ఉండేది. ప్రజల కష్టాలను కళ్లారా చూసిన రేగా కాంతారావు బస్టాండ్ అభివృద్ధికి రవాణా శాఖ మంత్రి వాడ అజయ్ కుమార్ కు విన్నవించడం జరిగింది తక్షణమే స్పందించిన మంత్రి కలెక్టర్ కు తక్షణమే నిధుల మంజూరు చేయమని ఆదేశించడం జరిగింది.
ఈ సందర్భంగా వి పి రేగా కాంతారావు మన్యం మీడియాతో మాట్లాడుతూ ప్రయాణికులు, అధికారులు, సిబ్బంది సౌకర్యార్థం మణుగూరు సురక్ష బస్టాండ్ అభివృద్ధికి రూ. 70 లక్షలు నిధులు మంజూరు చేయాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కు గురువారం ప్రభుత్వ విప్ ,పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు రవాణా శాఖ మంత్రి నిధులు మంజూరు చేయాలని కోరిన వెంటనే స్పందించడం జరిగిందని,తక్షణమే కలెక్టర్ ను మంత్రి అజయ్ ఆదేశించడం జరిగిందన్నారు.పినపాక నియోజకవర్గ ప్రజల చిరకాల వాంఛ ఐన సురక్ష బస్టాండ్ అభివృద్ధి కి నిధులు కేటాయించిన మంత్రి కి విప్ రేగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.✍️కొత్త దామోదర్ గౌడ్,మన్యం మీడియా ఆర్ ఎం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా.
Post A Comment: