మన్యం టీవీ, అశ్వాపురం:మాజీ ఏఐసిసి అధ్యక్షులు పార్లమెంట్ సభ్యులు రాహుల్ గాంధీ జన్మదిన సందర్భంగా అశ్వాపురం మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో హరి పా రోషిని వృద్ధాశ్రమంలో వృద్ధుల సమక్షంలో కేక్ కట్ చేసి వారికి పాలు పండ్లు బ్రెడ్డు స్వీట్లు పంచి పెట్టడం జరిగింది. పినపాక నియోజకవర్గ సీనియర్ కాంగ్రెస్ నాయకులు గాదె కేశవ రెడ్డి మాట్లాడుతూ భావి భారత ప్రధాని రాహుల్ గాంధీ అని దేశ ప్రజలందరూ కాంగ్రెస్ గవర్నమెంట్ కోసం ఎదురుచూస్తున్నారని బిజెపి గవర్నమెంట్ తోటి పేద మధ్యతరగతి అట్టడుగు స్థాయి ప్రజలకు జరిగిన మేలు ఏమీ లేదని అని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలంతా కేంద్రంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తీసుకు రావడం కొరకు కష్టపడి పని చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సొసైటీ డైరెక్టర్ ఓరుగంటి బిక్షమయ్య, కాంగ్రెస్ పార్టీ నాయకులు తూము వీరరాఘవులు, బచ్చు వెంకటరమణ, ఆటో నరసింహారావు, మాది నేని నరసింహారావు, ఆశ్రమ నిర్వాహకురాలు సహజన్ బేగం, తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: