మన్యంటీవీ, అశ్వారావుపేట:
4వ,విడత పల్లె ప్రగతి ప్రణాళికలో భాగంగా అశ్వారావుపేట మండలం నారాయణపురం గ్రామ పంచాయితీలో వున్నా గ్రామాల్లో ర్యాలీ నిర్వహించి పలు ప్రాంతాల్లో సమస్యలు గుర్తించి వాటికి సత్వర పరిష్కారం చేయుటకు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఈ కార్యక్రమం స్థానిక సర్పంచ్ కంగాల పరిమేష్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ ర్యాలీలో మండల తాహాసిల్దార్ చల్లా ప్రసాదు, జడ్పీటీసీ చిన్నంశెట్టి వరలక్ష్మి, ఎంపీటీసీ పాయం రమేష్, పంచాయతీ కార్యదర్శి సనప రాజేశ్వరి, జక్కుల రాంబాబు, నులకాని శ్రీనివాసరావు, నారాయణపురం రైతు సమన్వయ కమిటీ అధ్యక్షుడు చిన్నంశెట్టి వెంకట నరసింహారావు, ఉపాధ్యక్షుడు చిన్నంశెట్టి శ్రీనివాస్, వ్యవసాయ విస్తరణ అధికారి షకీరా భాను, గ్రామధిపకలు, అంగన్వాడి టీచర్స్ మరియు ఆశావర్కర్లు, పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: