ఏడూళ్ల బయ్యారం పోలీస్ స్టేషన్లో జరిగిన మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించిన మణుగూరు ఏఎస్పీ డా.శబరీష్ ఐపీఎస్.
మన్యం టీవీ, పినపాక:
ఈరోజు మధ్యాహ్నం నమ్మదగిన సమాచారం మేరకు ఏడూళ్లబయ్యారం సీఐ దోమల రమేష్ మరియు పినపాక మండల వ్యవసాయాధికారి వెంకటేశ్వర్లు మరియు సిబ్బంది దుగినేపల్లి గ్రామంలో బత్తుల లక్ష్మీనారాయణ,S/o.తిరుపతయ్య, వయస్సు : 58yrs. అను వ్యక్తి ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా తన ఇంటిలో విత్తనాలను విక్రయిస్తున్నాడని సోదాలు నిర్వహించారు.ఇట్టి సోదాలలో 14.450 కిలోల మిర్చి విత్తనాలను స్వాధీనం చేసుకోవడం జరిగిందని ఏఎస్పీ శబరీష్ ఐపీఎస్ తెలియజేసారు.పట్టుబడిన అనధికార మిర్చి విత్తనాల విలువ 4,75,000/-ల రూపాయలు ఉంటుందని వెల్లడించారు. ఇట్టి సోదాల్లో పట్టుబడిన వ్యక్తి బత్తుల లక్ష్మీనారాయణ మీద ఏడూళ్లబయ్యారం పోలీస్ స్టేషన్లో క్రిమినల్ కేసు నమోదు చేయడం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా ఎస్పీ శబరీష్ ఐపీఎస్ గారు మాట్లాడుతూ మణుగూరు పరిసర ప్రాంత రైతులను మోసం చేసి ఎవరైనా నకిలీ విత్తనాలను కానీ, ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేని విత్తనాలను కానీ విక్రయిస్తే అట్టి వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. నకిలీ విత్తనాలను విక్రయిస్తూ పట్టుబడిన వారిపై పీడీ యాక్ట్ లను నమోదు చేయడం జరుగుతుందని తెలిపారు.వ్యవసాయ అధికారులతో సమన్వయం పాటిస్తూ పోలీస్ అధికారులు నకిలీ విత్తనాలు అమ్మే వారిపై నిరంతరం ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. రైతులందరూ కూడా అన్ని రకాల అనుమతులు,లైసెన్సులు ఉన్న ఫెర్టిలైజర్ దుకాణాలలో మాత్రమే విత్తనాలను కొనుగోలు చేయాలని విజ్ఞప్తి చేశారు.
Post A Comment: