👉 భీముని గూడెం యూత్ని అభినందించిన జారే
మన్యం మనగడ ,అశ్వరావుపేట:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం, భీముని గూడెం( మద్ది కుంట) వాసం రామకృష్ణ కోవిడ్ బారిన పడి, కాలక్రృత్యములు తీర్చుకొనుటకు మరుగు దొడ్డి సదుపాయం లేకపోవడంతో చాలా ఇబ్బందులు పడుతున్నారు. వారి ఇబ్బందులు చూసి ,గ్రామ యూత్ చలించి పోయి, మరుగుదొడ్డి నిర్మాణానికి రూ. 20వేల నగదును జారే చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ భవాని కన్నా రావు, పార్టీ అధ్యక్షులు రామకృష్ణ , వార్డు మెంబర్ తాటి ధనలక్ష్మీ ,రాజినీ నాగేశ్వరరావు , పోలీస్ కానిస్టేబుల్ నాగార్జున ,యూత్ సభ్యులు నవీన్ ,
నాగరాజు , ప్రవీణ్ ,కిరణ్ , వెంకటేష్ ,చందు , శ్రీను , గంగరాజుతదితరులు పాల్గొన్నారు.
Post A Comment: