మన్యం టీవీ కరకగూడెం.
కరకగూడె మండలంలోని రేగళ్ల గ్రామ పంచాయతీ పరిధిలోని రేగళ్ల లో దోమతెరలు పంపిణి కార్యక్రమం ఆధార్ స్వచ్చంద సంస్థ ఆధ్వర్యంలో 138 కుటుంబాలకు అందించటం జరిగింది. ఆధార్ స్వచ్చంద సేవ సంస్థ డైరెక్టర్ తోలెం రమేష్ ఈ సందర్బంగా మాట్లాడుతూ.. గ్రామంలో పరిశుభ్రత పాటించాలని రోడ్డుకు ఇరువైపులా పిచ్చిమొక్కలు లేకుండా శుభ్రం చేసుకోవాలని మురికి గుంటలు లేకుండా పరిశుభ్రత పాటించాలని, కోవిడ్ జాగ్రత్తలు పాటించాలని ప్రతి వ్యక్తి మాస్క్ లు ధరించాలని, శానిటైజర్ లు ఉపయోగించాలి లేదా ఎక్కవ సార్లు చేతులు సబ్బుతో శుభ్రపర్చుకోవాలని తగు జాగ్రత్తలు పాటించాలని ఈ సందర్బంగా సూచనలు చేయడం జరిగింది. ఈ కార్యక్రమం లో పడిగా నారాయణ గారు, దొడ్డ భిక్షమయ్య , కమిటీ సభ్యులు తాటి. తిరుపతిరావు, కొమరం పాపారావు, లలిత,
సమ్మక్క గ్రామస్తులు పాల్గొన్నారు.
Post A Comment: