మన్యం టీవీ మంగపేట.
తెలంగాణా రాష్ట్ర వ్యాప్తంగా కరోనా కాలంలో సైతం ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ముందుండి వార్తలు సేకరిస్తున్న జర్నలిస్ట్ లను ఫ్రంట్ లైన్ వారియర్లగ గుర్తించి ప్రభుత్వం ఫ్రంట్ లైన్ వారియర్లకు ఇచ్చే అన్ని బెనిఫిట్స్ జర్నలిస్ట్ లకు ఇవ్వాలి.
రాష్ట్రంలోని ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియాలో జర్నలిస్ట్ లుగా విధులు నిర్వహిస్తున్న మీడియా ప్రతినిధులకు కరోనా వచ్చి మృతి చెందిన వారికి రాష్ట్ర ప్రభుత్వం తరపున వారి కుటుంబాలకు వెంటనే పది లక్షలు ఆర్ధిక సహాయము వెంటనే అందించాలని ఎమ్మార్పీఎస్ మండల ఇంచార్జి సురేష్ మాదిగ డిమాండ్ చేసారు. మీడియా ప్రతినిధులు ప్రజలకు మరియు ప్రభుత్వాలకు వారధిగా ఉండి ప్రజల విషయాలు ప్రభుత్వానికి మరియు ప్రభుత్వాల విషయాలు ప్రజలకు తెలియ జేస్తున పత్రిక రిపోర్టర్లు కరోనా వ్యాధి ద్వారా మృతి చెందిన వారికి ఆర్థిక సహాయం అందించాలని ఈసందర్బంగా మంగపేట మండల ఎమ్మార్పి ఎస్ ఇంచార్జి సురేష్ మాదిగ ప్రభుత్వాన్ని కోరారు.
Post A Comment: